భువనగిరి: వడదెబ్బతో వ్యక్తి మృతి

60చూసినవారు
భువనగిరి: వడదెబ్బతో వ్యక్తి మృతి
వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం యాదాద్రి జిల్లాలో జరిగింది. గ్రామస్తులు స్థానికుల వివరాలిలా. భువనగిరి మండలం అనంతారంకి చెందిన ఎల్లంల నర్సిరెడ్డి ద్విచక్ర వాహనంపై అత్తగారింటికి వెళ్తున్నాడు. భువనగిరి మున్సిపాలిటీ సమీపానికి రాగానే రహదారిపై ఎండ తీవ్రత తట్టుకోలేక ఒక్కసారిగా మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్