వలిగొండ పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు

5141చూసినవారు
వలిగొండ పీఎస్ లో మిస్సింగ్ కేసు నమోదు
వలిగొండ పోలీస్ స్టేషన్లో గురువారం మిస్సింగ్ కేసు నమోదైంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలిలా. మండల పరిధిలోని దుప్పల్లి గ్రామానికి చెందిన వల్లపు రామలింగయ్య (60) రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భార్యతో గొడవ కారణంగా ఇంటి నుండి వెళ్లిపోయాడని ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబీకులు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్