
పహల్గామ్ దాడితో అభివృద్ధి ఒక్కసారిగా వెనక్కి: ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పహల్గామ్ ఉగ్రదాడితో రాష్ట్రంలో ఆర్థిక, దౌత్య రంగాల్లో సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాక్కి అంతర్జాతీయ వేదికలపై మళ్లీ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించే అవకాశం కలిగింది. "మేము ఊహించని స్థితిలో ఉన్నాం. రక్తపాతం, ఆందోళన, మార్పు, క్షోభ అన్నీ జరిగాయి.. అయితే కొంతవరకూ మాత్రం ఏమీ మారలేదు" అని ఆయన పేర్కొన్నారు.