అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య

55చూసినవారు
అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
అప్పుల బాధతో ఓ యువ రైతు ప్రాణాలు తీసుకున్నాడు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన అవిరెండ్ల ఉపేందర్‌(30) తన అర ఎకరం భూమితో పాటు మరో నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తిసాగు చేస్తున్నారు. ఆశించిన దిగుబడులు రాక సుమారు రూ.4 లక్షల వరకు అప్పులయ్యాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్