పని ఒత్తిడితో యువతి మృతి.. వివాదాస్పదమైన నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు

54చూసినవారు
పని ఒత్తిడితో యువతి మృతి.. వివాదాస్పదమైన నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు
నిర్మలా సీతారామన్‌ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలోని ఓ కళాశాలలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో యర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇండియా ఉద్యోగి మరణాన్ని ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. సీఏ చదివిన ఓ యువతి పని ఒత్తిడి తాళలేక మరణించారన్న వార్త తనను కలచి వేసిందని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు పని ఒత్తిడిని జయించడం గురించి కూడా విద్యా సంస్థలు బోధించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్