సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్‌ కార్యాలయంలో రచ్చ రచ్చ చేసిన యువతి (వీడియో)

65చూసినవారు
సర్టిఫికెట్ల కోసం ఓ యువతి తహసీల్దార్ కార్యాలయంలో నానా హంగామా చేసింది. చివరికి సర్టిఫికెట్లు ఇచ్చాకే అక్కడ నుంచి కదిలింది. జోగులాంబ గద్వాల జిల్లా నారాయణపురానికి చెందిన హైమావతి అనే యువతి ఓబీసీ, క్యాస్ట్, ఆదాయ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే తనకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆరోపించింది. తహసీల్దార్‌ కార్యాలయంలో బైఠాయించింది. దీంతో చివరికి అధికారులు సర్టిఫికెట్లు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్