ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లో బుధవారం రాత్రి జరిగిన ఘోరం వెలుగులోకి వచ్చింది. పంకజ్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. రోడ్డుపై నిర్మాణ వ్యర్థాలు పడి ఉన్నాయి. వాటిని పక్కకు వేయాలని అక్కడ పని చేసే వారికి చెప్పాడు. దీంతో వాగ్వాదం జరిగింది. కోపంలో పంకజ్ను వారు పార, బ్యాట్తో కొట్టి చంపారు. పంకజ్ స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.