హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (IGMC) బాలికల హాస్టల్లోని 4 వ అంతస్తు నుంచి ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో కరణ్ పాటియాల్ అనే 22 ఏళ్ల యువకుడు కిందపడి మృతి చెందాడు. "కరణ్ హాస్టల్లో ఉంటున్న తన స్నేహితుడిని కలవాలనుకున్నాడు. ఈ క్రమంలో 4 వ అంతస్థులోని మెట్ల మీద నుండి దూకే ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోయి కిందపడి మృతిచెందినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు.