వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. "వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులే. ఎన్నికల వేళ నా బీసీ అంటూ సీఎం జగన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నా బీసీ అనేది జగన్ పెదాలపై తప్ప గుండెల్లో లేదు. బీసీలపై కనీస సానుభూతి లేని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కొనసాగడం అవసరమా?" అని ఆమె ప్రశ్నించారు.