తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గున మండుతున్నాయి. ఏప్రిల్ రాకముందే నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు మారాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశమున్నట్లు తాజాగా వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. రానున్న 3 రోజులు వడగాలులు వీచే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.