సోంపల్లెలో జయచంద్రారెడ్డి ప్రచారం

తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి సోంపల్లె, కోనేటి వారిపల్లె పంచాయతీల్లో శనివారం విజయ సంకల్ప యాత్ర చేపట్టారు. మహిళలు ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ, జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమికి ఓటేసి గెలిపించాలని కోరారు. జనసేన ఇంచార్జి సాయినాథ్, ఆంజనేయ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్