వేసవికాలం ఎండలు మండుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ వడదెబ్బ పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు మునికుమార్ సూచించారు. శనివారం కోటకొండ గ్రామంలో ఫ్యామిలీ ఫిజీషియన్ డాక్టర్ కార్యక్రమం చేపట్టారు. ప్రాథమిక పాఠశాలలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పిల్లలకు పలు వైద్యపరీక్షలు చేసి ఓఆర్స్ ద్రావణం పంపిణీ చేశారు.