AP: ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి ఓటు వేసేందుకు వచ్చేవారి కోసం ప్రత్యేక బస్సులు వేయాలని APSRTC ఎండీ ద్వారాకా తిరుమలరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చేవారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచాలని కోరారు. ఏపీలోని ప్రధాన పట్టణాల నుంచి జిల్లాలకు అదనపు బస్సులు వేయాలన్నారు.