ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తుల్ని కొట్టేసే యత్నం జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. నంద్యాల జిల్లా డోన్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. "ప్రజల భూముల్ని సీఎం జగన్.. తన పేరుతో రాసుకుంటున్నారు. రాయలసీమకు ఏమీ చేయని నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలి? పార్టీ రంగుల పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సైకోను రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలి." అని చంద్రబాబు పిలుపునిచ్చారు.