కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల వేళ జరిగిన హింసాత్మక ఘటనల్లో కొందరు వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎమ్మెల్యే రాచమల్లు పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకెళ్లారనే అభియోగం ఉంది. రాచమల్లుతో పాటు ఆయన బావమరిది మునిరెడ్డి పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.