
త్రివిధ దళాధిపతులతో మోదీ కీలక సమావేశం
త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. మోదీ నివాసంలో ఏర్పాటైన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, అజిత్ దోవల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాల్పుల విరమణ తర్వాత తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. బార్డర్లో నెలకొన్న పరిస్థితులు, భద్రతపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపు పాక్ తో జరగనున్న చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.