వాలంటీర్లు ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమం కూడా గడప గడపకూ అందిస్తూ సేవ చేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఈ మేరకు మంగళవారం దేవరపల్లి మండలం యర్నగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హోంమంత్రి వనిత మాట్లాడుతూ ప్రజలందరూ వాలంటీర్లకు నీరాజనాలు పలుకుతుంటే టీడీపీ, జనసేన నాయకులు అది చూసి ఓర్వలేకపోతున్నారు. వాలంటీర్లపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారు.