AP: కమిటీలు వేసి రాజధాని అమరావతిలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. టెండర్ల కాలపరిమితి ముగిసినందున కొత్త టెండర్లు పిలుస్తామన్నారు. కేబినెట్లో చర్చించాక పనులు ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజధానిలో సామగ్రి దొంగిలించిన వారిపై చర్యలుంటాయన్నారు. రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని వివరించారు.