విజయవాడలోని బాలోత్సవ భవన్లో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో మాట్లాడిన ప్రముఖులు రామోజీరావును తెలుగు జాతి దిగ్గజం, పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన మహోన్నతుడిగా గుర్తించారు. ఆయన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, విజయవాడ నడిబొడ్డున ఆయన కాంస్య విగ్రహం నిలిపాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కోరారు. రామోజీ లేకపోవడం పాత్రికేయులకు, తెలుగు భాషాభిమానులకు నష్టమని అభిప్రాయపడ్డారు.