వచ్చే నెలలో శాసనసభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25) పూర్తిస్థాయి బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ తయారీలో భాగంగా అన్ని శాఖల నిధుల అవసరాలపై చర్చించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశాలను నిర్వహిస్తున్నారు. కొత్త బడ్జెట్లో అత్యధికంగా నిధుల కేటాయింపులు వ్యవసాయ, నీటి పారుదల, విద్యుత్ శాఖలకే ఉంటాయని తెలుస్తోంది.