కాపులను పవన్ ఎదగనీయటం లేదు: పోతిన

కాపులను పసుపు సైన్యంగా మార్చే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారని వైసీపీ నేత పోతిన మ‌హేష్ అన్నారు. "చంద్రబాబు మీద అంతటి విశ్వాసం చూపడానికి పవన్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారు? బాబు గురించి భజన చేయటం, బాకా ఊదటం తప్ప ప‌వ‌న్‌ ఇంకేం చేశారు? పవన్ కాపులను ఎదగనీయటం లేదు. కాపుల ఆత్మగౌరవం దెబ్బ తింటోంది. ముద్రగడ కుటుంబంపై బాబు దాడి చేయిస్తే పవన్ ఎందుకు మాట్లాడలేదు?" అని మీడియా స‌మ‌క్షంలో పోతిన ప్ర‌శ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్