వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. "సీఎం జగన్ నా మీద నమ్మకంతో 15 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. ఆయా నియోజకవర్గాలను గెలిపించి మళ్లీ జగన్ను సీఎం చేస్తాను. 15 నియోజకవర్గాల కార్యకర్తల కోసం పని చేస్తాను. ఇందు కోసం అవసరమైతే పోటీ నుంచి కూడా తప్పుకుంటాను. అందరి తలరాతలను దేవుడు రాస్తే, నా తలరాతను మాత్రం సీఎం జగన్ రాస్తారు." అని మంత్రి పేర్కొన్నారు.