జాతీయ స్థాయి పోటీలకు పత్తికొండ విద్యార్థి ఎంపిక

పత్తికొండ పట్టణంలోని స్థానిక ఏపీ మోడల్ పాఠశాలలో సీఈసీ రెండో ఏడాది చదువుతున్న విద్యార్థి బోయ తేజేశ్వర్ మంగళవారం రాష్ట్రస్థాయి ఎసీఎఫ్ అండర్-19 పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో మహారాష్ట్రలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపల్ విక్టర్ శామ్యూల్, పీడీ రాజశేఖర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థిని కళాశాల బృందం అభినందించింది.

సంబంధిత పోస్ట్