తిరుపతిలోని జూపార్క్లో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లిన సందర్శకుడిపై సింహం దాడి చేసి చంపేసింది. మృతుడు రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ (38)గా గుర్తించారు. ఇప్పటివరకు మృతదేహం లభ్యం కాలేదు. దాడి చేసిన సింహాన్ని జూ అధికారులు బోన్లో బంధించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక కావాలనే ఆ వ్యక్తి లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లాడా? అనేది విచారణలో తేలాల్సి ఉంది.