ఏపీ కేబినెట్ తొలి సమావేశం ఈ నెల 24వ తేదీన జరుగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు తొలి కేబినెట్ సమావేశాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై కేబినెట్లో కీలక చర్చ జరుగనుంది. మొత్తం ఎనిమిది శాఖలపై శ్వేత పత్రాల విడుదలపై కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.