ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. ధౌలాడి నివాసి పప్పు కుటుంబం కాంట్రాక్ట్పై మామిడి తోటను తీసునికొని సాగుచేసుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పప్పు తన కుమారులు రాజా, చాంద్తో కలిసి ఓ తోట నుంచి నీరు తరలించేందుకు వెళ్తుండగా వీరిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో పప్పు, రాజా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నివారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిందౌరా గ్రామంలో జరిగింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.