పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

78చూసినవారు
పార్టీ మార్పుపై స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే తన లక్ష్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలోనే రైతులు సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు రైతులు ఎంత ఆందోళనలో ఉన్నారో ఓ సారి రేవంత్ రెడ్డి సమీక్షించుకోవాలని సూచించారు. కేసీఆర్ హయాంలో జరిగిన మంచిని మంచిగా చెప్పడం కొందరికి నచ్చడం లేదని సెటైర్లు వేశారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు.

సంబంధిత పోస్ట్