దారుణం.. ప్రియురాలిని 14 సార్లు రాడ్డుతో కొట్టి చంపాడు (వీడియో)

మహారాష్ట్రలోని వసాయ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని నడిరోడ్డుపై ఇనుప రాడ్డుతో తలపై 14 సార్లు కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం చించ్‌పాడలో జరిగింది. రోహిత్ యాదవ్, ఆర్తి యాదవ్ కొన్ని రోజుల క్రితం ప్రేమించుకుని విడిపోయారు. ఈ క్రమంలో ఆర్తి యాదవ్ వేరే అబ్బాయితో చనువుగా ఉండటం చూసి కోపం పెంచుకున్న రోహిత్ ఆమెను దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్