కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ను వదులుకుని రాయ్బరేలి ఎంపీగా కొనసాగుతానని చెప్పిన విషయం తెలిసిందే. కాగా వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ బరిలో దిగుతారని ప్రకటించారు. ఈ క్రమంలో ప్రియాంక పోటీపై ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాధ్రా స్పందించారు. ప్రియాంక గాంధీ పార్లమెంట్లో అడుగుపెడితే బీజేపీ నోరుమెదపని.. రైతుల సంక్షేమం, నిరుద్యోగం, మహిళల భద్రత వంటి అంశాలపై గళమెత్తుతారని అన్నారు.