చాలామంది ఒత్తిడికి గురైనప్పుడూ ఎక్కువ జంక్ ఫుడ్ తినడానికి మొగ్గు చూపుతారు. అయితే అధికంగా కొవ్వు కలిగిన జంక్ తినటం వల్ల శరీరంలోని గట్ బాక్టీరియాకు అంతరాయం కలిగి మెదడు రసాయనాలపై ప్రభావం చూపిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. అయితే చేపలు, ఆలీవ్ నూనె, విత్తనాలు, గింజల్లో ఉండే కొన్ని రకాల కొవ్వులు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి మెదడుకు మంచి చేస్తాయని పరిశోధకులు తెలిపారు.