ఈ వేసవిలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ ఎండాల దాటికి కార్లు, బైక్ లు అగ్నికి ఆహుతవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్లో జరిగింది. సమీప మార్కెట్లో పార్క్ చేసి ఉంచిన మారుతీ వ్యాన్కు మంటలు వ్యాపించాయి. అందరూ భయంతో దూరంగా పారిపోయారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఆ వాహనం పేలడంతో గాల్లోకి ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.