బండరాయితో కొట్టి వివాహిత దారుణ హత్య

హన్మకొండ జిల్లా కాజీపేటలో వివాహితను దారుణంగా హత్య చేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్ లో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో ముఖంపై కొట్టి చంపారు. బట్టుపల్లి నుంచి ఉర్సుగుట్టకు వెళ్లే దారిలో ఈ ఘటన జరిగింది. మృతురాలు పర్సులో లభించిన ఆధార్ కార్డు బట్టి ఆమెను దర్గాకాజీపేటలోని లావుడ్యా తండాకు చెందిన కుమార్ భార్య యామిని అలియాస్ కుమారిగా పోలీసులు గుర్తించారు. అయితే కుమార్ భార్య మిస్సింగ్ పై ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు అతడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్