ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న

63చూసినవారు
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్లతో ఆధీక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ కు 36210 (తీన్మార్ మల్లన్న), బీఆర్ఎస్ కు 28540 (రాకేష్ రెడ్డి), బీజేపీకి 11395 (ప్రేమెందర్ రెడ్డి), ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ కు 9019 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 88369 చెల్లిన ఓట్లు కాగా 7728 చెల్లని ఓట్లు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్