టీ20 ప్రపంచకప్లో భాగంగా ఐర్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమ్ఇండియా బ్యాటర్ రోహిత్ శర్మ ఐర్లాండ్ బౌలర్లపై చెలరేగాడు. కేవలం 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 50 పరుగులు సాధించాడు. కోహ్లీ 1(5) పరుగుకే అవుట్ అవ్వగా రోహిత్ దూకుడు పెంచి అదరగొట్టాడు. 52 (37) పరుగులు చేసి రిటైడ్ హర్ట్ గా వెనుదిరిగాడు. దీంతో ఇండియా 10 ఓవర్లకి 76/1 పరుగులు చేసింది.