బిగ్ బాస్ షోపై CPI నారాయణ మండిపాటు

బిగ్ బాస్ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. నిన్న బస్సుల అద్దాలు ధ్వంసమైన ఘటనపై ఆర్టీసీ ఎండి సజ్జనార్ సీరియస్ అవడంపై ఆయన స్పందించారు. 'BIG BOSSపై చర్యలు తీసుకోవాలని గతంలో సజ్జనార్ సీపీగా ఉన్నప్పుడు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. డబ్బుల కోసం కక్కుర్తిపడి నాగార్జున యాంకరింగ్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలను ఆకర్షించేందుకు రైతు బిడ్డని తీసుకొచ్చారు. అది కాస్తా వైలెంట్ గా మారి తన్నుకున్నారు' అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్