ఉగాది పండుగ పునరుత్తేజాన్ని వెంట తీసుకువస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అంటూ ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. పండుగకు సంబంధించిన ఓ కోట్ను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. ఈ కొత్త సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో అమితమైన సంతోషాన్ని, శ్రేయస్సును నింపాలని కోరుకుంటున్నట్లు మోదీ చెప్పారు.