కూకట్‌పల్లిలో లారీ బీభత్సం(వీడియో)

555చూసినవారు
హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. పోలీసుల వివరాల ప్రకారం.. KPHB పీఎస్ పరిధిలోని హైదర్ నగర్ మైసమ్మ గుడి వద్ద ఉన్న మెట్రో పిల్లర్ ను అతివేగంగా వచ్చి ఓ లారీ ఢీకొట్టింది. దీంతో లారీ ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలవగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. లారీ రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్ జామైంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్