కుటుంబమంతా కలిసి చూసే కంటెంట్ను అందించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో ఓ OTT ప్లాట్ఫామ్ను తీసుకురానుందని సమాచారం. భారతీయ సమాజం, సంస్కృతీ సంప్రదాయాలను చూపించడమే లక్ష్యంగా ఇందులోని కంటెంట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వినోదంతో పాటు కరెంట్ అఫైర్స్ను ఇందులో కవర్ చేస్తారట. ఏడాది లేదా రెండేళ్లు ఉచితంగా అందించి, తర్వాత సబ్స్క్రిప్షన్ ధరలు నిర్ణయిస్తారని సమాచారం.