పశ్చిమ బెంగాల్ బసిర్హత్ నుంచి బీజేపీ అభ్యర్థి, సందేశ్ఖాలీ బాధితుల్లో ఒకరైన రేఖ పాత్రకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఫోన్ చేశారు. ఆమె ప్రచార సన్నాహాలు, బీజేపీకి ప్రజల్లో ఉన్న మద్దతు గురించి ఆయన ఆమెతో మాట్లాడారు. కాల్ సమయంలో, సందేశ్ఖాలీలో మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలను రేఖ పంచుకున్నారు. ప్రధానమంత్రి ఆమెను 'శక్తి స్వరూప' అని పిలిచారు. బసిరాత్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రేఖా పోటీ చేయనున్నారు.