టెక్ రంగంలో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. తాజాగా వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా డెల్ 6000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గత రెండేళ్లుగా తన కంప్యూటర్లను ఎక్కువ మంది ప్రజలు కొనుగోలు చేయకపోవడంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు డెల్ తెలిపింది. విక్రయాలు పడిపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టిన క్రమంలో ఉద్యోగులపై వేటు వేయక తప్పలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.