లిక్కర్ స్కాం కేసులో తన రిమాండ్ను సవాలు చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం 10.30 గంటలకు జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ పిటిషన్ను విచారించనున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ను ఈ నెల 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది.