కేజ్రీవాల్ పిటిషన్‌పై రేపు విచారణ

75చూసినవారు
కేజ్రీవాల్ పిటిషన్‌పై రేపు విచారణ
లిక్కర్ స్కాం కేసులో తన రిమాండ్‌ను సవాలు చేస్తూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం 10.30 గంటలకు జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ పిటిషన్‌ను విచారించనున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ను ఈ నెల 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది.

సంబంధిత పోస్ట్