ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారానికి సంబంధించి కేజ్రీవాల్ ముసుగు తొలగిపోయిందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ 47 డిగ్రీల సెల్సియస్లో రోడ్షోల్లో పాల్గొంటున్నారని, అయితే అదే సమయంలో అనారోగ్యం సాకుతో బెయిల్ను పొడిగించాలని కోరడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.