దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయంలో సెన్సెక్స్ 200 పాయింట్లు పెరిగి 77,691 వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 23,630 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, విప్రో లాభాల్లో ఉండగా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్యుఎల్ నష్టపోయాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.59 వద్ద ప్రారంభమైంది.