ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. వరాజ్పూర్లోని ఖేరేశ్వర్ ఘాట్లో ఇద్దరు సొంత అన్నదమ్ములు ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోయారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో మృతుల కుటుంబంలో కన్నీటి అలముకున్నాయి. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.