రానున్న 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు?

55చూసినవారు
రానున్న 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు?
రాబోయే 3, 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఏపీలో ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి, శ్రీ సత్యసాయి, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్