తెలంగాణలో కాంగ్రెస్ తమ కొత్త ఫైర్ బ్రాండ్ పై దృష్టి సారించింది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా జోడు పదవుల్లో రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్ష పదవికి సమర్థుడైన వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం అన్వేషిస్తోంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం అంచనాలకు మించి రేవంత్ రెడ్డి రాణించారు. దీంతో ఆయన స్థాయి వ్యక్తికే పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తోంది. మరోవైపు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని భట్టి విక్రమార్క కోరుతున్నట్టు చెబుతున్నారు.