బాలికను వెంబడించి కుక్కల దాడి

80చూసినవారు
బాలికను వెంబడించి కుక్కల దాడి
తమిళనాడు తిరువళ్లూరు సమీపంలోని పెరంబూరులో మే 18న షాకింగ్ ఘటన జరిగింది. తయ్యూబ్ బేగం అనే మహిళ తన ఇద్దరు కుమార్తెలతో మసీదు నుంచి వస్తోంది. ఆ సమయంలో వీధి కుక్కలు తయ్యూబ్ బేగం పెద్ద కుమార్తె అనీషాను వెంబడించాయి. భయంతో అనీషా పారిపోయింది. ఆ కుక్కలు అనీషాను వెంబడించి కరిచాయి. తల్లి కుక్కలను తరిమి కొట్టి అనీషాను రక్షించింది. ప్రస్తుతం అనీషా పెరియార్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్