రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు, రాజీవ్గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం, కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలిపి 1,81,732 సీట్లను అఖిలభారత సాంకేతిక విద్యా మండలి ఆమోదం తెలిపింది. అమృత, గీతం, కేఎల్యూ, విజ్ఞాన్ డీమ్డ్ వర్సిటీల్లో 9,180 సీట్లకు ఆమోదం ఇచ్చింది. ఈ సీట్లను ఆయా విద్యాసంస్థలే నేరుగా భర్తీ చేసుకుంటాయి.