శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందన రోడ్ రైల్వే స్టేషన్లో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. భువనేశ్వర్-విశాఖ ఇంటర్సిటీ రైలు వచ్చే ముందు తేనెటీగలు దాడి చేశాయి. దాంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. తేనెటీగల దాడిలో గాయపడిన ప్రయాణికులను స్థానిక ఆస్పత్రిలో తరలించారు.