వైఎస్సార్ జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పారు. పులివెందులలో ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అనంతరం వీరశివారెడ్డి మాట్లాడుతూ.. "జగన్ సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితుడినయ్యా.. అందుకే వైసీపీలో చేరా. సంక్షమే పథకాల్ని నేరుగా ఇళ్లకే చేర్చారు. ఈ పథకాలు ఇలాగే అమలవ్వాలంటే మళ్లీ జగనే సీఎం కావాలి." అని పేర్కొన్నారు.